
రాశి ఖన్నా ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకుంటోంది. ఆమె ఇప్పుడు ఓషో పుస్తకాలు చదువుతోంది. ఓషో ఒకప్పుడు భారతదేశంలో పేరొందిన ఆధ్యాత్మిక గురువు. విదేశాల్లో ఆయనకి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉండేది. ఆయన జీవితం గురించి చెప్పిన అనేక ప్రసంగాలు పుస్తకాలుగా వచ్చాయి. వాటికి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం రాశి ఖన్నా వాటిని చదువుతోంది. “ఓషో ఎలా బతకాలో నాకు నేర్పలేదు. నాకు ఇంతకుముందే తెలిసిన దాన్ని మళ్ళీ గుర్తు చేశారు. మర్చిపోకుండా చేశారు.”
“ఓషో పుస్తకాలు మొదటిసారి చదివినప్పుడు ఆయన చెప్పిన నగ్న సత్యాలు మొదట ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత నన్ను భయాల నుంచి విముక్తి చేశాయి,” అని చెప్పుకొచ్చింది ఈ భామ.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఒకప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు కేరీర్ లో వెనుకబడింది. సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి నటిస్తోన్న “తెలుసు కదా” ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.