
కొన్ని రోజుల కిందటి సంగతి. ఊహించని విధంగా డెకాయిట్ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకుంది. అప్పటికే ఆమెపై గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. షూటింగ్ కూడా కొనసాగించారు. కానీ ఆమె తప్పుకుంది. ఆమె తప్పుకుందని కొంతమంది, తొలిగించారని మరికొంతమంది రాసుకొచ్చారు. ఈ క్రమంలో అడవి శేష్ వైపు అన్ని వేళ్లు చూపించాయి.
ఎట్టకేలకు ఈ అంశంపై హీరో అడివి శేష్ స్పందించాడు. శృతిహాసన్ ను తొలిగించడం విషయంలో పెద్ద వివాదం ఏమీ లేదంటున్నాడు ఈ హీరో. వర్కింగ్ స్టయిల్స్ సెట్ అవ్వక ఆమె తప్పుకుందని వెల్లడించాడు.
“శృతిహాసన్ తో పనిచేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మా వర్కింగ్ స్టయిల్స్ కుదరలేదు. పైగా కూలీ సినిమాతో ఆమె బిజీగా ఉంది. ఎలాంటి గొడవల్లేవు. మాట్లాడుకొని, ఫ్రెండ్లీగానే విడిపోయాం. సినిమా చేయడానికి నాకు చాలా టైమ్ పడుతుంది. ఆ ప్రాసెస్ శృతిహాసన్ కు సింక్ అవ్వలేదు. కేవలం ఈ కారణంతోనే ఆమె తప్పుకుంది. అంతకంటే పెద్ద వివాదం ఏమీ లేదు.”
ఆ వెంటనే మృణాల్ ను తీసుకున్నాడు అడివి శేష్. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు కథ విన్న తర్వాత 2-3 వారాలు టైమ్ తీసుకొని ఓకే చెబుతారని.. మృణాల్ మాత్రం ఉదయం 10 గంటలకు కథ విని, మధ్యాహ్నం ఒంటి గంటకు ఓకే చెప్పిందని అన్నాడు.