
పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” కథ దర్శకుడు క్రిష్ రాశారు. క్రిష్ చెప్పిన కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ వెంటనే అంగీకరించారు. దాంతో సినిమాని మొదలుపెట్టారు నిర్మాత ఏ.ఎం. రత్నం. ఐతే, షూటింగ్ విషయంలో తలెత్తిన విబేధాల కారణంగా క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. క్రిష్ తప్పుకున్న తర్వాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ సినిమాని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాడు.
ఐతే, ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ క్రిష్ ని పొగిడారు. ఆయన కథ వల్లే ఇదంతా సాధ్యమైంది అని చెప్పారు.
దాంతో ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి మౌనం వహించిన క్రిష్ ఇప్పుడు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్, రత్నంలని పొగిడారు.
“ఆ ఇద్దరి వల్లే ఈ సినిమా సాధ్యమైంది. పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం ఇద్దరూ ఇద్దరే. వారి పట్టుదల వల్లే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది,” అన్నట్లుగా సుదీర్ఘ పోస్టులో రాసుకున్నారు. ఇంతకీ తాను ఎందుకు తప్పుకున్నాడో చెప్పలేదు.















