
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది.
75 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో అగంతకులు ఆమె ఎకౌంట్ ను హ్యాక్ చేసి, తమ క్రిప్టో కరెన్సీ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో శృతిహాసన్ ప్రకటించింది.
తన ట్విట్టర్ ఎకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని, దయచేసి ఎవ్వరూ తన ఎకౌంట్ తో ఇంటరాక్ట్ అవ్వొదని ఆమె విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మళ్లీ ట్విట్టర్ ను తన ఆధీనంలోకి తీసుకుంటానని ఆమె తెలిపింది.
కొన్నేళ్ల కిందట కూడా ఇలానే శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆమెకు 3 రోజులు పట్టింది.
మరోవైపు, శృతి హాసన్ తన కొత్త చిత్రం “కూలి” విడుదలకు ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో ఆమె రజినీకాంత్ కూతురిగా నటించినట్లు టాక్.