
ప్రియాంక చోప్రాకి చాలా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా భారీ పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ చిత్రాలకు ఆమె మొదటి ఛాయిస్ గా మారింది. ఇప్పటికే రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. హృతిక్ రోషన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న క్రిష్ 4 చిత్రంలో కూడా ఆమె హీరోయిన్.
అలాగే రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న “రామాయణం” సినిమాలో మొదట ప్రియాంకనే తీసుకోవాలనుకున్నారట. సూర్పనఖ పాత్రకు ప్రియాంకకి ఇవ్వాలనుకున్నారట. కానీ పారితోషికం ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని డ్రాప్ అయ్యారు మేకర్స్.
దాంతో, ఆ పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కి దక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ అలా ఒక భారీ సినిమాలో భాగం అయింది ఇప్పుడు. సూర్పనఖ పాత్ర రామాయణం కథకి కీలకం. ప్రియాంక భారీ పారితోషికం డిమాండ్ రకుల్ కి అలా కలిసొచ్చింది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాకి 20 నుంచి 30 కోట్ల మధ్య తీసుకుంటోంది. పాత్ర, ఆ సినిమా బడ్జెట్ ని బట్టి ఆమె పారితోషికం డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ ఆమెనే.