
శంకర్ ఇటీవలే తెలుగులో అరంగేట్రం చేశారు. ఆయన మూడేళ్లు పాటు సాగదీసి తీసిన “గేమ్ చేంజర్” ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. కానీ ఆయనకి మొదటి తెలుగు చిత్రం…చివరి చిత్రం అనిపించేలా చేసింది. మొత్తం కెరీర్ ప్రమాదంలో పడింది. అంత దారుణంగా పరాజయం పాలైంది.
ఇప్పుడు శంకర్ కూతురు అదితి శంకర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం… భైరవం. ఈ సినిమాలో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించింది.
ఈ సినిమా కోసం ఆమె తెగ ప్రమోషన్లు చేస్తోంది. స్టేజ్ పై డ్యాన్సులు చేస్తోంది. ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఒక కొత్త హీరోయిన్ సక్సెస్ కోసం ఎంత కష్టపడుతుందో అంత చేస్తోంది. ఒక అగ్ర దర్శకుడు కూతురిని అన్న విషయం పక్కనపెట్టి తన సినిమా కోసం అన్ని ఎఫెర్ట్లు పెడుతోంది.
తండ్రికి తెలుగులో విజయం దక్కలేదు. మరి కూతురికి అయినా హిట్ వస్తుందా?
“భైరవం” ఈ నెల 30న విడుదల కానుంది.