విజయ్ దేవరకొండ, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల కలుసుకున్నారు. వారిద్దరూ కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆ మాటకొస్తే విజయ్ దేవరకొండకు దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ సూపర్ స్టార్ యష్ తో “కేజీఎఫ్” విడుదలకు ముందు నుంచే మంచి స్నేహం ఉంది.
ఐతే, తాజాగా విజయ్ దేవరకొండని ప్రశాంత్ నీల్ కలవడం, ఆ ఫోటో బయటికి రావడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం దేశంలో ప్రశాంత్ నీల్ మన టాప్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత యమా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు. “కేజీఎఫ్” సినిమాలతో పాటు “సలార్”తో ఆయనకి క్రేజ్ అమాంతం పెరిగింది.
పైగా ఇప్పుడు “సలార్ 2” మొదలు కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ ఉంది. దాంతో, విజయ్ ని ఎందుకు కలిశాడు అనే ప్రశ్న వస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా ఫ్లాపుల్లో ఉన్నాడు. వచ్చిన స్టార్డంకి దెబ్బ పడింది.
విజయ్ దేవరకొండ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోవడం లేదు. కేవలం ఇది స్నేహపూర్వక మీటింగ్ అని సమాచారం.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More