మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు తెచ్చుకొంది. అంతే స్థాయిలో సక్సెస్ పొందింది. ఆమె సంపాదన కూడా తెలుగులో నటించిన తర్వాతే ఎక్కువగా పెరిగింది.
అందుకే, ఆమె ఇప్పుడు తనకి హిందీ, తెలుగు… రెండూ ముఖ్యమే అని చెప్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో ఇదే మొదటి ప్రాధాన్యం అనేది లేదంటోంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగుతుందట.
ప్రస్తుతం ఈ భామ హిందీలో “సన్ ఆఫ్ సర్దార్ 2” సినిమా ప్రమోట్ చేస్తోంది. అజయ్ దేవగణ్ సరసన నటించింది ఇందులో. “పూజ మేరీ జాన్” అనే మరో చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇవి కాకుండా బాలీవుడ్ లో మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలా బాలీవుడ్ లో బిజీగా ఉంది.
తెలుగులో అడివి శేష్ సరసన “డెకాయిట్” చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది. ఇక అన్నింటికీ మించి అల్లు అర్జున్ సరసన బడా సినిమా లాగేసుకొంది. అట్లీ తీస్తున్న సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది ఈ భామ. ఇలా తెలుగులో బడా సినిమాలు వస్తుండడంతో కేవలం బాలీవుడ్ అనో, టాలీవుడ్ అనో చెప్పలేను అని చెప్తోంది.
హిందీ చిత్రసీమ వల్లే తనకి బ్రేక్ వచ్చింది, తెలుగు వల్ల లాభం దక్కింది. సో, రెండింటిపై కృతజ్ఞతాభావం ఉంది అని చెప్తోంది ఈ అందాల సుందరి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
"మున్నీటి గీతలు" పేరుతో రచయిత చింతకింది శ్రీనివాస రావు ఒక నవల రాశారు. అది 2021లో వచ్చింది. ఆ నవలకి… Read More