అవీ ఇవీ

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

Published by

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు తెచ్చుకొంది. అంతే స్థాయిలో సక్సెస్ పొందింది. ఆమె సంపాదన కూడా తెలుగులో నటించిన తర్వాతే ఎక్కువగా పెరిగింది.

అందుకే, ఆమె ఇప్పుడు తనకి హిందీ, తెలుగు… రెండూ ముఖ్యమే అని చెప్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో ఇదే మొదటి ప్రాధాన్యం అనేది లేదంటోంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగుతుందట.

ప్రస్తుతం ఈ భామ హిందీలో “సన్ ఆఫ్ సర్దార్ 2” సినిమా ప్రమోట్ చేస్తోంది. అజయ్ దేవగణ్ సరసన నటించింది ఇందులో. “పూజ మేరీ జాన్” అనే మరో చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇవి కాకుండా బాలీవుడ్ లో మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలా బాలీవుడ్ లో బిజీగా ఉంది.

తెలుగులో అడివి శేష్ సరసన “డెకాయిట్” చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది. ఇక అన్నింటికీ మించి అల్లు అర్జున్ సరసన బడా సినిమా లాగేసుకొంది. అట్లీ తీస్తున్న సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది ఈ భామ. ఇలా తెలుగులో బడా సినిమాలు వస్తుండడంతో కేవలం బాలీవుడ్ అనో, టాలీవుడ్ అనో చెప్పలేను అని చెప్తోంది.

హిందీ చిత్రసీమ వల్లే తనకి బ్రేక్ వచ్చింది, తెలుగు వల్ల లాభం దక్కింది. సో, రెండింటిపై కృతజ్ఞతాభావం ఉంది అని చెప్తోంది ఈ అందాల సుందరి.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

గీతా వల్ల దెబ్బతిన్న క్రిష్!

"మున్నీటి గీతలు" పేరుతో రచయిత చింతకింది శ్రీనివాస రావు ఒక నవల రాశారు. అది 2021లో వచ్చింది. ఆ నవలకి… Read More

July 29, 2025