“మున్నీటి గీతలు” పేరుతో రచయిత చింతకింది శ్రీనివాస రావు ఒక నవల రాశారు. అది 2021లో వచ్చింది. ఆ నవలకి తానా బహుమతి కూడా లభించింది. ఆ నవల నచ్చి దర్శకుడు క్రిష్ చింతకింది శ్రీనివాసరావు రాసిన నవల హక్కులను కొన్నారు. ఆయన్ని తన రైటింగ్ టీంలో ఒక మెంబర్ గా తీసుకున్నారు.
ఆ నవల కథ ఏంటో తెలుసా?
శ్రీకాకుళం నుంచి కొందరు జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్తారు. గుజరాత్ లోని ఒక సేఠ్ చెప్పినట్లుగా వాళ్ళు చేపలను సముద్రం లోపలికి వెళ్లి భారతీయ హద్దులు దాటి పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి అడుగుపెడతారు. దాంతో పాకిస్తాన్ వారిని బంధించి జైల్లో పెడుతుంది. వారిని విడిపించేందుకు జరిగే ప్రయత్నమే ఈ “మున్నీటి గీతలు.”
ఈ కథ చదివుతుంటే మొన్నే ఓ సినిమా చూసినట్లు అనిపిస్తుంది కదూ. అవును… గీతా ఆర్ట్స్ సంస్థ నాగ చైతన్య హీరోగా “తండేల్” అనే పేరుతో సినిమా తీసింది. కథ ఒక్కటే. హీరోయిన్ పాయింట్ , లవ్ స్టోరీ మాత్రం డిఫెరెంట్. అలా ఈ నవల నుంచి పాయింట్ కాపీ కొట్టి తీసి సినిమాని విడుదల చేశారు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాసు.
పాపం, క్రిష్ ఈ నవల హక్కులు పొంది వెబ్ డ్రామాగా తీశారు. సత్యదేవ్, ఆనందిని జంటగా ఈ వెబ్ డ్రామా రూపొందింది. “అరేబియా కడలి” పేరుతో వెబ్ సిరీస్ ని నిర్మించారు క్రిష్. అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ వెబ్ సిరీస్ వచ్చినా ఆల్రెడీ తండేల్ ఛాయలున్నాయని జనం అనుకుంటారు అసలు విషయం తెలియక. పాపం అలా క్రిష్ గీతా ఆర్ట్స్ వల్ల దెబ్బతిన్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More