న్యూస్

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

Published by

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం మారింది. ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలకు, తమిళంలో అజిత్, విజయ్ సినిమాల ఓపెనింగ్స్, కలెక్షన్లు రజినీకాంత్ సినిమాల కన్నా ఎక్కువ ఉంటాయి. అలాగే, “కబాలి” తర్వాత రజినీకాంత్ రాజకీయాల వైపు మొగ్గు చూపడం, బీజేపీతో అంటకాగడంతో ఆయన మార్కెట్ తమిళనాట బాగా పడిపోయింది.

ఐతే, ఎప్పుడైతే రజినీకాంత్ రాజకీయాలకు దూరం అని ప్రకటించారో అప్పటి నుంచి మళ్ళీ స్వింగ్ లోకి వచ్చారు. అలా “జైలర్”తో మరోసారి తన క్రేజ్, తన స్థాయి ఏంటో నిరూపించారు. ఐతే ఆ తర్వాత వచ్చిన సినిమా మాత్రం తుస్సుమంది. మళ్ళీ ఇప్పుడు “కూలీ”తో అదరగొడుతున్నారు.

“కూలీ” సినిమా విడుదలకి 15 రోజుల పైనే ఉంది. కానీ అప్పుడే అమెరికాలో ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్స్ మాములుగా లేవు. అర మిలియన్ డాలర్ మార్క్ దాటిపోయింది. ఒక్క ప్రీమియర్ షోతోనే ఈ సినిమా అమెరికాలో రెండు మిలియన్ డాలర్లు పొందేలా ఉంది. దాంతో, మరోసారి రజినీకాంత్ తన సూపర్ స్టార్డం ఏంటో చూపిస్తున్నాడు అని అంటున్నారు.

ఒకవైపు, ఈ సినిమాకి పోటీగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన “వార్ 2” విడుదల అవుతోంది. ఆ సినిమా ఓపెనింగ్స్ రజినీకాంత్ సినిమాతో పోల్చితే చాలా తక్కువ ఉండేలా ట్రెండ్ సాగుతోంది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025

గీతా వల్ల దెబ్బతిన్న క్రిష్!

"మున్నీటి గీతలు" పేరుతో రచయిత చింతకింది శ్రీనివాస రావు ఒక నవల రాశారు. అది 2021లో వచ్చింది. ఆ నవలకి… Read More

July 29, 2025