ఇప్పుడు పెద్ద సినిమాలకు, పాన్ ఇండియా చిత్రాలకు తప్పనిసరి నటిగా మారింది కియారా అద్వానీ. ఆమెకున్న డిమాండ్, క్రేజ్ అలా ఉంది మరి. ఆమె చేతిలో ఉన్న చిత్రాలన్నీ అలాంటివే.
తాజాగా మరో పెద్ద పాన్ ఇండియా చిత్రానికి ఈ భామ డేట్స్ ఇచ్చేసింది. “కేజీఎఫ్” హీరో యష్ నటిస్తున్న కొత్త చిత్రం యష్ లో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది అనేది పాత న్యూస్. ఇప్పుడు ఆమె ఈ సినిమాకి తన కాల్షీట్లు కూడా ఇచ్చేసింది. ఇక ఆమె ఫోకస్ అంతా “టాక్సిక్”పైనే.
ఆమె తెలుగులో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇక హిందీలో ఆమె ఒప్పుకున్న బడా చిత్రం “డాన్ 3” ఇంకా షూటింగ్ ఊపందుకోలేదు. మరోవైపు, “వార్ 2” సినిమా షూటింగ్ మొదలైంది కానీ ఆమె పాత్రకి సంబంధించిన చిత్రీకరణ మేలో మొదలవుతుంది.
సో, ఆమె ఇప్పుడు యష్ సినిమాకి సులువుగానే డేట్స్ ఇచ్చేసింది.
సినిమాకి మూడున్నర నుంచి ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకునే కియారా అద్వానీ పెళ్లి తర్వాత పెద్ద సినిమాలు రావడం విశేషం.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More