ఈ ఏడాది ప్రారంభంలో ‘జై హనుమాన్’ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి, ఇందులో నటీనటుల ఎంపికపై స్పెక్యులేషన్ నడుస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తారనే చర్చ జోరుగా సాగింది. తాజాగా దీనికి ఫుల్ స్టాప్ పడింది.
‘జై హనుమాన్’ లో ప్రధాన పాత్రధారిగా రిషబ్ శెట్టిని తీసుకున్నారు. సినిమాను అధికారికంగా ప్రకటించడంతో పాటు రిషబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘జై హనుమాన్’ థీమ్ మ్యూజిక్ ను కూడా బయటపెట్టారు.
ఇప్పుడీ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి కారణం దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో ఫొటో రిలీజ్ చేయడమే. ఇటు ప్రశాంత్ వర్మ, అటు రిషబ్ శెట్టి, మధ్యలో రానా.. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ ఫొటో పోస్ట్ చేసి జైజై హనుమాన్ అంటూ క్యాప్షన్ తగిలించాడు దర్శకుడు.
దీంతో ఈ ప్రాజెక్టులోకి రానా వచ్చాడనేది ఫిక్స్ అయింది. అయితే అతడు ఏ పాత్ర పోషించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో విలన్ గా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. కాబట్టి ‘జై హనుమాన్’ లో అతడికి రావణుడి పాత్రను కట్టబెట్టే అవకాశం ఉందంటూ ప్రచారం నడుస్తోంది. మరికొందరు మాత్రం ఫిక్షన్ కథ కాబట్టి, రెగ్యులర్ విలన్ పాత్రే అయి ఉండొచ్చని అంటున్నారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More