రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ప్రకటించి పోలీసులను హైరానా చేశారు. నేను ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డయల్ 112 కు లావణ్య ఫోన్ చేయగా వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు నార్సింగి పోలీసులు. ఆమెని రక్షించి, కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు ఆమెకి భరోసా కల్పించారు.
“రాజ్ తరుణ్ మాల్వీ మలోత్రా మోజులో పడి మారి పోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు. నేను చావాలని అనుకోవడానికి కారణం మాల్వీ మలోత్రా,” అంటూ ఆమె తన లాయర్ ఫోన్ కి మెసేజ్ పెట్టినట్లు సమాచారం.
తనపై పుకార్లు పుట్టిస్తున్నారు అని ఆమె అంటోంది. గాసిప్స్ తో విసిగిపోయాను అని చెప్తోంది. ఇప్పటికీ ఆమె రాజ్ తరుణ్ ని ఆమె భర్తగానే అభివర్ణిస్తోంది.
“నా భర్త నాకు కావాలని మాల్వి మలోత్రాను బ్రతిమిలాడాను కానీ తను వినిపించుకోవట్లేదు. ఇద్దరూ కులుకుతున్నారు. రాజ్ తరుణ్ ఆమె మోజులో, మాయలో ఉన్నాడు,” అని తాజాగా చెప్పింది.
ఇవన్నీ చూసి విసుగెత్తి, ఇక ఈ లోకంలో ప్రయాణం ముగిస్తున్నా అంటూ నిన్న అర్ధరాత్రి ఆమె హంగామా చేసింది.
ఐతే రాజ్ తరుణ్ తో సంబంధం గురించి ఆమె చెప్తున్న కొన్ని మాటల్లో రకరకాల తేడాలున్నాయి. ఆమె ఆమెని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఒకసారి గుళ్లో పెళ్లి చేసుకున్నాను అని చెప్తోంది. మళ్ళీ అతను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడని అంటోంది. రాజ్ తరుణ్ వల్ల గర్భవతిని అయ్యాను… అబార్షన్ చేయించాడని మొదట చెప్పిన ఆమె ఆ తర్వాత తనకు మిస్ క్యారేజ్ అయింది అని చెప్పింది. ఇలా పరస్పర విరుద్ధ మాటలతో ఆమె తన కేసును తన బలపర్చుకొంది అని అంటున్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More
మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా… Read More
రాశి ఖన్నా ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకుంటోంది. ఆమె ఇప్పుడు ఓషో పుస్తకాలు చదువుతోంది. ఓషో ఒకప్పుడు భారతదేశంలో పేరొందిన… Read More
సైలెంట్ గా తన సినిమాల్ని పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాల్ని పూర్తిచేసే… Read More
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన 'భైరవం' సినిమా రేపు (మే 30) విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక… Read More