కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా స్పందించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన తాత స్థాపించిన టీడీపీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా చంద్రబాబును మామయ్యా అంటూ ఎన్టీఆర్ సంభోదించడం చాలామందికి నచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపాడు తారక్. చంద్రబాబు మామయ్యా మీకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ పెట్టాడు. అదే ట్వీట్ లో పురందేశ్వరిని అత్త అని, బాలయ్యను బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడు ఎన్టీఆర్.
ఇక పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా ఓ ట్వీట్ కేటాయించాడు. ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అటు మహేష్ బాబు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్రమోదీకి శుభాకాంక్షలు అందించాడు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం, ప్రేమకు గుర్తుగా ఈ గెలుపు లభించిందంటూ పవన్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఐదేళ్లలో కలలను సాకారం చేయాలని ఆకాంక్షించాడు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More