ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది.
75 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో అగంతకులు ఆమె ఎకౌంట్ ను హ్యాక్ చేసి, తమ క్రిప్టో కరెన్సీ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో శృతిహాసన్ ప్రకటించింది.
తన ట్విట్టర్ ఎకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని, దయచేసి ఎవ్వరూ తన ఎకౌంట్ తో ఇంటరాక్ట్ అవ్వొదని ఆమె విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మళ్లీ ట్విట్టర్ ను తన ఆధీనంలోకి తీసుకుంటానని ఆమె తెలిపింది.
కొన్నేళ్ల కిందట కూడా ఇలానే శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆమెకు 3 రోజులు పట్టింది.
మరోవైపు, శృతి హాసన్ తన కొత్త చిత్రం “కూలి” విడుదలకు ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో ఆమె రజినీకాంత్ కూతురిగా నటించినట్లు టాక్.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు కొత్తేం కాదు. గతంలో ఓసారి ఇలానే పుకార్లు వచ్చాయి. వాటిని స్వయంగా… Read More