ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది.
75 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో అగంతకులు ఆమె ఎకౌంట్ ను హ్యాక్ చేసి, తమ క్రిప్టో కరెన్సీ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో శృతిహాసన్ ప్రకటించింది.
తన ట్విట్టర్ ఎకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని, దయచేసి ఎవ్వరూ తన ఎకౌంట్ తో ఇంటరాక్ట్ అవ్వొదని ఆమె విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మళ్లీ ట్విట్టర్ ను తన ఆధీనంలోకి తీసుకుంటానని ఆమె తెలిపింది.
కొన్నేళ్ల కిందట కూడా ఇలానే శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆమెకు 3 రోజులు పట్టింది.
మరోవైపు, శృతి హాసన్ తన కొత్త చిత్రం “కూలి” విడుదలకు ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో ఆమె రజినీకాంత్ కూతురిగా నటించినట్లు టాక్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More