సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో కూడా ఊహించని వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు కాజల్ ది కూడా అదే బ్యాడ్ పొజిషన్.
రీసెంట్ గా కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లింది కాజల్. కొడుకు, భర్తతో కలిసి సాగరతీరంలో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. పనిలోపనిగా కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.
ఆమె బీచ్ ఫొటోలకు లక్షల్లో లైకులొచ్చాయి. అలా మరోసారి కాజల్ హాట్ టాపిక్ గా మారింది. అయితే అదే టైమ్ లో ఆమె ఫొటోలు వివాదాస్పదమయ్యాయి. దీనికి కారణఁ ‘కన్నప్ప’ సినిమా.
మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇందులో ఆమె శివుడి భార్య పార్వతీ దేవి పాత్ర పోషించింది. ఇటు పార్వతి దేవి పాత్రలో ఆమె నటించిన ‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధమౌతున్న వేళ.. బీచ్ లో ఆ డ్రెస్సుతో ఫొటోలు ఏంటంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి బీచ్ లో ఆమె కాస్త పద్ధతిగానే కనిపించింది. టూ-పీస్ బికినీలో కనిపించినట్టయితే ఇంకెంత రచ్చ జరిగేదో.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More
చిరంజీవి తల్లి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు కొత్తేం కాదు. గతంలో ఓసారి ఇలానే పుకార్లు వచ్చాయి. వాటిని స్వయంగా… Read More