హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఒకే రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 పెద్ద సినిమాల షూటింగ్స్ చేస్తున్నట్టు వెల్లడించింది.
“ఆర్టిస్ట్ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మాత్రం నిజంగా గొప్పగా అనిపిస్తాయి. ఎంతో అదృష్టం ఉండాలి. ఒకే రోజు 2 పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాను. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే, ఇంకోటి తెలంగాణలో నడుస్తోంది. ఒకే రోజు 2 రాష్ట్రాల్లో 2 సినిమాలు. ఈ రెండు సినిమాల్ని మీకు చూపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే పండగ వస్తోంది.”
“హరిహర వీరమల్లు”, “రాజాసాబ్” సినిమాల్ని ఉద్దేశించి నిధి అగర్వాల్ ఈ పోస్ట్ పెట్టింది. విజయవాడ సమీపంలో వేసిన సెట్ లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది నిధి. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే హైదరాబాద్ లో “రాజాసాబ్” షూట్ లొకేషన్ లో జాయిన్ అయింది.
మొన్నటివరకు ఈమె కేవలం “రాజాసాబ్” షూట్ లో మాత్రమే పాల్గొంది. ఎప్పుడైతే “హరిహర వీరమల్లు” సినిమా సెట్స్ పైకి వచ్చిందో, ఒక్కసారిగా బిజీ అయింది.
ఆమె అంకితభావానికి మారుతి లాంటి వాళ్లు ఫిదా అవుతున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More