న్యూస్

మహేష్-పవన్ ఫ్యాన్స్ కలిశారు

Published by

శింగనమల రమేష్ అనే ఓ పాత తరం నిర్మాత చేసిన ఒకే ఒక్క కామెంట్ తో ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్, అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏకమయ్యారు. శింగనమలపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏం కామెంట్ చేశాడు.?

తన కోర్టు కేసు క్లియర్ అయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టాడు శింగనమల రమేష్. గతంలో తను తీసిన “ఖలేజా”, “కొమరం పులి” సినిమాలపై స్పందించాడు. ఆ సినిమాల వల్ల తనకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చాడు. అప్పట్లోనే కొమరం పులి సినిమాకు మూడేళ్లు టైమ్ పట్టిందని, అదే తన కొంప ముంచిందన్నాడు.

ఈ వ్యాఖ్యల్ని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. బండ్ల గణేశ్ మరో అడుగు ముందుకేశాడు. ఆ సినిమా టైమ్ లో తను ప్రత్యక్ష సాక్షినని, ప్లానింగ్ లేకుండా మూడేళ్లు సినిమా తీసి, పవన్ కు చెందిన అమూల్యమైన వందలాది కాల్షీట్లను నిర్మాత వృధా చేశారని, ఇకనైనా ఇలాంటి విమర్శలు చేయడం ఆపుకోవాలని అన్నాడు.

ఇటు మహేష్ ఫ్యాన్స్ కూడా డ్యూటీ ఎక్కారు. “ఖలేజా” సినిమాను అటుఇటుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా… అంతకుమించి నష్టాలు ఎలా వస్తాయో చెప్పాలని శింగనమలను డిమాండ్ చేస్తున్నారు. 

Recent Posts

మేలో ఒక హిట్, ఒక యావరేజ్

సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More

June 1, 2025

భారీ సెట్ లో ‘డ్రాగన్’ షూటింగ్

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే పేరు పరీశీలనలో ఉంది.… Read More

June 1, 2025

ఇండస్ట్రీకి ‘రీ రిలీజు’లు శాపం!

తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More

June 1, 2025

శేఖర్ కమ్ముల ‘మెగా’ మూమెంట్

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం "డాలర్ డ్రీమ్స్" 2000వ సంవత్సరంలో విడుదలైంది.… Read More

May 31, 2025

సినిమా జరుగుతున్నంత వరకు చాలు!

బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం "రానా నాయుడు 2" (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా… Read More

May 31, 2025

సర్జరీలు చేయించుకోలేదు!

మలైక అరోరా వయసు 51 ఏళ్ళు. కానీ ఆమె ఫిజిక్ చూస్తే 30 ఏళ్ల యువతిలా ఉంటుంది. సాధారణంగా సినిమా… Read More

May 30, 2025