కొన్ని సినిమాలు సడెన్ గా వార్తా మాధ్యమం నుంచి మాయమౌతాయి. ఆ తర్వాత ఉన్నఫలంగా ప్రత్యక్షమౌతుంటాయి. ఇది అలాంటి సినిమానే. సుహాస్-కీర్తిసురేష్ కాంబినేషన్ పై అప్పట్లో భలే చర్చ జరిగింది. కట్ చేస్తే, ఆ తర్వాత మాయమైంది. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైంది. నేరుగా ఓటీటీలోకి వస్తోంది.
కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటించిన కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’. ఈ సినిమా డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ పెడుతున్నారు. స్మశాన వాటిక నేపథ్యంలో, విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన సినిమా ఇది. కీర్తిసురేష్ కు డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కొత్త కాదు, ఇంతకుముందు ఆమె నటించిన సినిమా ఒకటి ఇలానే డైరక్ట్ ఓటీటీలోకి వచ్చింది.
అయితే ఇక్కడ మేటర్ అది కాదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కీర్తిసురేష్ నుంచి తెలుగులో వస్తున్న సినిమా ఇది. ‘భోళాశంకర్’ డిజాస్టర్ తర్వాత కీర్తి మళ్లీ కనిపించలేదు. ఇప్పుడీ ‘ఉప్పు కప్పురంబు’తో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More