న్యూస్

డైరక్ట్ గా ఓటీటీలోకి కీర్తి

Published by

కొన్ని సినిమాలు సడెన్ గా వార్తా మాధ్యమం నుంచి మాయమౌతాయి. ఆ తర్వాత ఉన్నఫలంగా ప్రత్యక్షమౌతుంటాయి. ఇది అలాంటి సినిమానే. సుహాస్-కీర్తిసురేష్ కాంబినేషన్ పై అప్పట్లో భలే చర్చ జరిగింది. కట్ చేస్తే, ఆ తర్వాత మాయమైంది. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైంది. నేరుగా ఓటీటీలోకి వస్తోంది.

కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటించిన కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’. ఈ సినిమా డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ పెడుతున్నారు. స్మశాన వాటిక నేపథ్యంలో, విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన సినిమా ఇది. కీర్తిసురేష్ కు డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కొత్త కాదు, ఇంతకుముందు ఆమె నటించిన సినిమా ఒకటి ఇలానే డైరక్ట్ ఓటీటీలోకి వచ్చింది.

అయితే ఇక్కడ మేటర్ అది కాదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కీర్తిసురేష్ నుంచి తెలుగులో వస్తున్న సినిమా ఇది. ‘భోళాశంకర్’ డిజాస్టర్ తర్వాత కీర్తి మళ్లీ కనిపించలేదు. ఇప్పుడీ ‘ఉప్పు కప్పురంబు’తో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

Recent Posts

చిరుతో జాయిన్ అయిన నయనతార

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. చిరంజీవి… Read More

June 17, 2025

పిల్ల తల్లులు … పని గంటలు!

ఒకప్పుడు హీరోయిన్ కి పెళ్లి ఐతే చాలు క్రేజ్ పోయేది. అవకాశాలు తగ్గిపోయాయి. 20 ఏళ్ల క్రితమే అలాంటి ట్రెండ్… Read More

June 17, 2025

ఈసారి పాటలు క్లిక్ కాలేదు

దర్శకుడు శేఖర్ కమ్ముల శైలి ప్రత్యేకం. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు ఉంది. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్,… Read More

June 17, 2025

అవును నేను దొంగనే!

నాగార్జున ఓ దొంగ. పైగా ఇంటి దొంగ. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. చిన్నప్పుడు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు… Read More

June 16, 2025

పవన్ తో సినిమా చేస్తా: ధనుష్

ధనుష్ కేవలం నటుడు మాత్రమే కాదు. అతడు మంచి దర్శకుడు కూడా. మినిమం గ్యాప్స్ లో సినిమాలకు డైరక్షన్ చేస్తుంటాడు.… Read More

June 16, 2025

జోనిత గాంధీ: ‘అవి పంపుతున్నారు’

భారతీయ సినిమా ప్రపంచంలో సినిమా హీరోయిన్ల స్థాయిలో అందచందాలతో అదరగొట్టే గాయనీమణులు చాలా మంది ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలి…… Read More

June 15, 2025