ఈమధ్యే బాలకృష్ణ 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఘనంగా స్వర్ణోత్సవ సంబరాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి వంతు. తను కూడా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే బయటపెట్టారు.
అది 1974…నర్సాపురంలోని వైఎన్ఎం కాలేజీలో చిరంజీవి చదువుకుంటున్న రోజులు. బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మనసులో నటించాలనే కోరిక, కానీ ఎలా అనుకుంటున్న టైమ్ లో వచ్చింది అవకాశం.
అప్పటివరకు నలుగురు స్నేహితుల మధ్య నటించడమే తప్ప, స్టేజ్ ఎక్కని చిరంజీవి.. తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. స్టేజ్ పై నటించారు. ఆయన నటించిన తొలి నాటకం ‘రాజీనామా’.
అప్పట్నుంచి చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. ఈ ఏడాదితో అది 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇదే విషయాన్ని గుర్తుచేసిన మెగాస్టార్, తన తొలి నాటకానికే ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చిందంటూ, ఫొటో కూడా షేర్ చేశారు.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More