త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సెట్స్ పైకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ అప్ డేట్స్ బయటకొచ్చాయి. నవంబర్ నెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.
మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నిజానికి హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ అనుకున్నారు. కానీ సెట్ అందుబాటులోకి రాలేదు. అందుకే మైసూర్ లో 2 వారాల షెడ్యూల్ పూర్తిచేసి, ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న భారీ సెట్ లోకి షిఫ్ట్ అవుతారు.
సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం ఈ సెట్ లోనే ఉంటుంది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఆమె ఫస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందా అవ్వదా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 3 పాటల కంపోజిషన్ పూర్తిచేశాడు కూడా. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా ఇదే. చరణ్, బుచ్చిబాబు సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. దాదాపుగా ఇదే టైటిల్ ఫిక్స్.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More