ఈ వారం థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాలే ఆసక్తికరంగా ఉన్నాయి. ‘నరుడి బ్రతుకు నటన’, ‘పొట్టేల్’ లాంటి చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. ‘శ్వాగ్’, ‘సత్యం సుందరం’ లాంటి ఆసక్తిరక చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి.
ఈ రెండు సినిమాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.
ముందుగా ‘శ్వాగ్’ విషయానికొద్దాం. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకుడు. సినిమాలో ఫుల్లుగా కామెడీ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు భంగపడ్డారు. ఎలాంటి అంచనాల్లేకుండా చూస్తే సినిమా చాలా కొత్తగా, ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తే చూద్దామని చాలామంది వెయిటింగ్.
ఇక మరో సినిమా ‘సత్యం సుందరం’. గుండెల్ని పిండేసి, హృదయాల్ని కదిలించిన సినిమా ఇది. కార్తి, అరవింద్ స్వామి నటించిన ఈ సినిమాను చూస్తూ చాలామంది థియేటర్లలో కంటతడి పెట్టుకున్నారు కూడా.
అంతటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఈ సినిమాను చూద్దామనుకునేలోపే థియేటర్ల నుంచి మాయమైంది. ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ‘సత్యం సుందరం’, అమెజాన్ లో ‘శ్వాగ్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More