“పుష్ప 2” ప్రీమియర్ షో వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని తెలుసుకున్న తాను, దర్శకుడు సుకుమార్ చాలా బాధపడ్డామని అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు.
‘‘గత 20 ఏళ్లుగా ప్రేక్షకులతో కలిసి నా సినిమాలను ఎప్పుడూ థియేటర్లోనే చూశాను. ఈసారి కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో చూశాను. రేవతి గారు థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించడం దురదృష్టకరం. ఆమె మరణంతో షాక్ అయ్యాం. వారి కుటుంబానికి అండగా ఉంటాను. ఆమె ఇద్దరు పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు నేను వ్యక్తిగతంగా రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తున్నాను, అని అల్లు అర్జున్ అన్నారు.
“ఈ బాధలో వారు ఒంటరిగా లేరని చెప్తున్నాను. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తానని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను,” అని స్పష్టం చేశారు.
“పుష్ప 2” సినిమా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వెళ్లారు. బన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ సమయంలో రేవతి, ఆమె కుమారుడు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. రేవతి వెంటనే మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More