“పుష్ప 2” ప్రీమియర్ షో వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని తెలుసుకున్న తాను, దర్శకుడు సుకుమార్ చాలా బాధపడ్డామని అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు.
‘‘గత 20 ఏళ్లుగా ప్రేక్షకులతో కలిసి నా సినిమాలను ఎప్పుడూ థియేటర్లోనే చూశాను. ఈసారి కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో చూశాను. రేవతి గారు థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించడం దురదృష్టకరం. ఆమె మరణంతో షాక్ అయ్యాం. వారి కుటుంబానికి అండగా ఉంటాను. ఆమె ఇద్దరు పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు నేను వ్యక్తిగతంగా రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తున్నాను, అని అల్లు అర్జున్ అన్నారు.
“ఈ బాధలో వారు ఒంటరిగా లేరని చెప్తున్నాను. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తానని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను,” అని స్పష్టం చేశారు.
“పుష్ప 2” సినిమా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వెళ్లారు. బన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ సమయంలో రేవతి, ఆమె కుమారుడు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. రేవతి వెంటనే మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More