నాని హీరోగా “‘ఎవడే సుబ్రహ్మణ్యం” అంటూ మూవీ తీశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది అతనికి మొదటి చిత్రం. ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ పదేళ్ల కాలంలో ఈ దర్శకుడు కేవలం మూడే సినిమాలు తీశాడు. అవి… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 2898 AD.
మార్చి 21న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మళ్ళీ విడుదల అవుతోంది.. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు.
ముగ్గురు పిల్లల్లో ఎవరు ఇష్టమంటే ఎలా చెపుతాం? “మహానటి” సినిమా దర్శకుడిగా చాలా సంతృప్తినిచ్చింది. దానికి కారణం.. ఆ సినిమాకి చాలా టైం దొరికింది. సినిమాని మరింత మెరుగు చూసుకునే వెసులుబాటు, సమయం లభించింది. అందుకే, బాగా వచ్చింది.
ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ఉండొచ్చు. ప్రభాస్ డేట్స్ అవీ చూసుకోవాలి.
కల్కి సినిమాకి ఎక్కువ టైం పట్టింది. అలాంటి భారీ సినిమాని రెండేళ్లలో పూర్తి చెయ్యలేం. నటీనటుల డేట్స్, విజువల్ ఎఫెక్ట్స్, సెట్లు… ఇలా చాలా తతంగం దర్శకుడి చేతిలో ఉండవు. కెరీర్ పరంగా చాలా తృప్తిగా ఉన్నాను. నేను చేసిన జాన్రా, కథ మరొకరు చేయలేదు. తీసిన మూడూ హిట్టే. చాలా హ్యాపీగా ఉంది.
“కల్కి”లో నానిని తీసుకోవాలి అనుకున్నాం. వర్క్ అవుట్ కాలేదు. ఈ సారి వర్కవుట్ చేస్తాం.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More