హీరోయిన్ శృతిహాసన్, ప్రభాస్ కలిసి “సలార్” సినిమాలో నటించారు. ఆ సినిమా విడుదల చాలా కాలమే అయింది. అయినా ఆమె మరోసారి ప్రభాస్ ను గుర్తు చేసుకుంది. ఇంకా చెప్పాలంటే, ఒక విషయంలో ప్రభాస్ ను ఆమె అస్సలు మరిచిపోలేకపోతోంది.
ప్రభాస్ ఇచ్చిన అతిథ్యం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని చెబుతోంది. అందుకే మరిచిపోలేకపోతుందట.
“సలార్’ సినిమా చేస్తున్న టైమ్ లో శృతిహాసన్ కు గుర్తుండిపోయే ఆతిథ్యం ఇచ్చాడు ప్రభాస్. టేబుల్ నిండా వంటకాలు వడ్డించాడంట. కొన్ని వంటకాలు చల్లారిపోకుండా ఉండేందుకు పెద్దపెద్ద హాట్ బాక్సుల్లో పెట్టాడంట. ప్రతి వంటకాన్ని కొసరి మరీ వడ్డించేవాడంట.
రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ ఫుడ్ వ్లాగర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది శృతిహాసన్. అతడు పెట్టిన వంటకాలు చూసి, ప్రభాస్ ను మరోసారి గుర్తుచేసుకుంది. నటుడ్ని కాకపోయి ఉన్నట్టయితే ప్రతి రోజూ రకరకాల వంటకాలు రుచిచూసేవాడినని శృతిహాసన్ తో ప్రభాస్ చెప్పాడట .
ఈ ఏడాది “సలార్ 2 ” మొదలు కావాలి. కానీ ఆ ఆలోచనని ప్రస్తుతం విరమించుకున్నారు. ఆ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాయలు కూడా కనిపించడం లేదు. ప్రభాస్ తో షూటింగ్ ను బాగా మిస్ అవుతున్నానని అంటోంది శృతిహాసన్.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More