తన సినిమాకి సంబంధించి ఒక్కో అప్ డేట్ కి ఒక్కో ప్రెస్ మీట్ పెడుతున్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఇప్పటికే ఎన్నో మీడియా సమావేశాలు పెట్టారు. తాజాగా కూడా మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి తెలుగు భాషా దినోత్సవం పేరిట సమావేశం ఏర్పాటుచేశారు. ఎప్పట్లానే ఎన్టీఆర్, హరికృష్ణ చిత్రపటాలకు పూజలు చేశారు.
ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పెట్టి, స్వీయదర్శకత్వంలో వైవీఎస్ చౌదరి ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా వీణ రావును తీసుకున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో మేటర్ బయటపెట్టారు చౌదరి. ఇదొక పీరియడ్ సినిమా అంట. కథ 1980 నేపథ్యంలో సాగుతుందంట. అంతేకాదు, తెలుగు భాష, సంస్కృతిని చాటిచెప్పే సినిమా అంట.
తెలుగు భాష, సంస్కృతి, విలువల్ని చాటిచెబుతూ ఎప్పట్నుంచో ఓ సినిమా తీయాలని ప్లాన్ లో ఉన్నారట వైవీఎస్. అయితే డాక్యుమెంటరీలా కాకుండా, కమర్షియల్ గా వాటిని చెప్పాలని అనుకున్నారట. నందమూరి తారకరామారావు సినిమాతో అది ఇన్నాళ్లకు నెరవేరుతుందని అంటున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More