తన సినిమాకి సంబంధించి ఒక్కో అప్ డేట్ కి ఒక్కో ప్రెస్ మీట్ పెడుతున్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఇప్పటికే ఎన్నో మీడియా సమావేశాలు పెట్టారు. తాజాగా కూడా మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి తెలుగు భాషా దినోత్సవం పేరిట సమావేశం ఏర్పాటుచేశారు. ఎప్పట్లానే ఎన్టీఆర్, హరికృష్ణ చిత్రపటాలకు పూజలు చేశారు.
ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పెట్టి, స్వీయదర్శకత్వంలో వైవీఎస్ చౌదరి ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా వీణ రావును తీసుకున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో మేటర్ బయటపెట్టారు చౌదరి. ఇదొక పీరియడ్ సినిమా అంట. కథ 1980 నేపథ్యంలో సాగుతుందంట. అంతేకాదు, తెలుగు భాష, సంస్కృతిని చాటిచెప్పే సినిమా అంట.
తెలుగు భాష, సంస్కృతి, విలువల్ని చాటిచెబుతూ ఎప్పట్నుంచో ఓ సినిమా తీయాలని ప్లాన్ లో ఉన్నారట వైవీఎస్. అయితే డాక్యుమెంటరీలా కాకుండా, కమర్షియల్ గా వాటిని చెప్పాలని అనుకున్నారట. నందమూరి తారకరామారావు సినిమాతో అది ఇన్నాళ్లకు నెరవేరుతుందని అంటున్నారు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More