రానా-అనిరుధ్ కలిశారు. కొత్త సినిమా కోసం వీళ్లు చేతులు కలపలేదు. ఓ కంపెనీలో వీళ్లిద్దరూ కలిసి పెట్టుబడి పెట్టారు. అది కూడా ఓ లిక్కర్ కంపెనీ. మైక్రో బ్రూవరీ ఐరన్ హిల్ ఇండియా యజమాని వడ్లమూడి శ్రీహర్షతో కలిసి వీళ్లిద్దరూ పెట్టుబడులు పెట్టారు. వీళ్ల ముగ్గురి పెట్టుబడి విలువ 10 మిలియన్ డాలర్లు.
ఈ పెట్టుబడితో వీళ్లు సరికొత్త టకీలా బ్రాండ్ ను ఇండియాకు పరిచయం చేయబోతున్నారు. మెక్సికోలో పండించే అగావే అనే మొక్క నుంచి ఈ మద్యాన్ని తయారుచేస్తారు. కాక్టస్ జాతికి చెందిన మొక్క ఇది. దీన్ని అక్కడ లోకా లోకా అని పిలుస్తారు. ఇండియా, అమెరికాలో టకీలా అంటారు.
త్వరలోనే ఈ బ్రాండ్ అమ్మకాలు అమెరికాలో మొదలుకానున్నాయి. మరో 18-24 నెలల్లో ఇండియాలో కూడా అమ్మకాలు మొదలవుతాయి.
ఈ సరికొత్త టకీలానాను సెలబ్రేషన్ డ్రింక్ గా అభివర్ణిస్తున్నాడు రానా. తెలంగాణలో సంబరాలు చేసుకునే క్రమంలో ఆనవాయితీగా కల్లు తాగుతారని, రానురాను డ్రింకింగ్ అలవాట్లలో మార్పులొస్తున్నాయి. ఆ మార్పుల్ని ఆహ్వానిస్తూ.. రాబోయే రోజుల్లో టకీలా అనేది సెలబ్రేషన్ డ్రింక్ గా మారుతుందని అంటున్నాడు రానా.
మద్యం బ్రాండ్స్ లో పెట్టుబడులు పెట్టడం రానాకు ఇదే తొలిసారి కాదు. గతంలో జిన్ తయారుచేసే ఓ బ్రూవరీలో డబ్బులు పెట్టాడు ఈ నటుడు. ఇప్పుడు అనిరుధ్ తో కలిసి పెట్టుబడులు విస్తరిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More