మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’ షూటింగ్ జోరుగా సాగుతోంది. “బింబిసార” తీసిన వశిష్ట ఈ సినిమాకి దర్శకుడు. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ రోజు వివి వినాయక్ సెట్ కి విచ్చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, వి వి వినాయక్ కలసివున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు.
వినాయక్ ఇటీవల సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేరు. దర్శకుడిగా సినిమాలు తీసి చాలా ఏళ్ళు అవుతోంది. కానీ, సినిమా ఇండస్ట్రీలో తనకు బాగా సన్నిహితమైన వారి సెట్స్ కి వెళ్తుంటారు. చిరంజీవితో వినాయక్ కి మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో “ఠాగూర్ “, “ఖైదీ నంబర్ 150” వంటి సినిమాలు వచ్చాయి.
ఇక దర్శకుడు వశిష్ఠ వినాయక్ వద్ద పని చేశారు. అలాగే వశిష్ఠ తండ్రి వినాయక్ దర్శకత్వంలో సినిమాలు నిర్మించారు.
“విశ్వంభర” వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More