ఒక్కోసారి మేకర్స్ మరీ అమాయకత్వంగా బిహేవ్ చేస్తుంటారు. తమ సినిమాకు టాక్ తేడా వస్తే వెంటనే సినిమాకు కత్తెర్లు వేస్తారు. ట్రిమ్ చేశాం అని ప్రకటిస్తారు.
తాజాగా విడుదలైన “మిస్టర్ బచ్చన్” విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ పేలవంగా ఉన్నాయి అని రివ్యూస్ వచ్చాయి. దాంతో మేకర్స్ వెంటనే మేల్కొన్నారు. సినిమా నుంచి 13 నిమిషాలు కట్ చేశారు. ఇప్పుడు సినిమా పర్ఫెక్ట్ గా ఉంది అని అంటున్నారు.
“డబుల్ ఇస్మార్ట్” విషయంలో కూడా ఇదే జరిగినట్టు వార్తలొస్తున్నాయి కానీ ట్రిమ్మింగ్ జరిగిందనే విషయాన్ని మేకర్స్ మాత్రం బయటకు చెప్పలేదు. చాలా వల్గర్ గా ఉన్న అలీ కామెడీ ట్రాక్ ను ఫస్టాఫ్ లో ఒక చోట, సెకెండాఫ్ లో 2 చోట్ల కట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
ట్రిమ్మింగ్ తో సినిమా టాక్ ని మార్చేస్తాం అనుకోవడం పొరపాటు. ఈ రోజుల్లో టాక్ చాలా స్పీడ్ గా వెళ్తోంది. ఒక్కసారి థియేటర్లో బొమ్మ పడిన తర్వాత ఆ టాక్ ని మార్చలేం.
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More