“కార్తికేయ-2” జాతీయ స్థాయిలో హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను జాతీయ ఫిలిం అవార్డుల జ్యూరీ కూడా గుర్తించింది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా “కార్తికేయ-2″కు అవార్డు ప్రకటించింది. దీంతో యూనిట్ ఉబ్బితబ్బివుతోంది. ఇదే ఊపులో కార్తికేయ-3పై ప్రకటనలు చేశారు హీరో, దర్శకుడు.
కార్తికేయ-2కు అవార్డు రావడం అంతా కృష్ణుడి దయ అన్నాడు దర్శకుడు చందు మొండేటి. సినిమాలో చెప్పిన కృష్ణ తత్వం అందరికీ కనెక్ట్ అయిందని, అదే తమకు అవార్డ్ తెచ్చిపెట్టిందన్నాడు.
కార్తికేయ-3 సినిమాపై కథా చర్చలు జోరుగా సాగుతున్నాయని ప్రకటించాడు.చందు మొండేటి
ప్రస్తుతం “తండేల్” సినిమా తీస్తున్నాడు చందు మొండేటి. ఈ సినిమా తర్వాత తను చేయబోయే ప్రాజెక్టు కార్తికేయ-3 అని ప్రకటించాడు ఈ దర్శకుడు. అటు హీరో నిఖిల్ కూడా ఇదే విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు.
కార్తికేయ-3 సినిమా తన ఎంటైర్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలవబోతోందని వెల్లడించాడు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్లు నడుస్తున్నాయని, ఎవరూ ఊహించని రేంజ్ లో, భారీ స్థాయిలో కార్తికేయ-3 ఉంటుందని, ఈసారి మరో కొత్త విషయాన్ని, దేశమంతా కనెక్ట్ అయ్యే అంశాన్ని చర్చించబోతున్నామని తెలిపాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More