దర్శకుడు ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా టైమ్ లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది.
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం, మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఎకౌంట్ లో కొన్ని స్క్రీన్స్ షాట్స్ ను కూడా ఆయన పోలీసులకు సమర్పించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు అనుకూలంగా వ్యూహం అనే సినిమా తీశాడు వర్మ. వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎదిగిన వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ఆ సినిమా తీశాడు.
దీన్ని అడ్డుకునేందుకు ఒక దశలో నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరారు. కానీ సినిమా రిలీజైంది. ఆ సినిమా విడుదల సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఐటీ చట్టం కింద కేసు నమోదైంది.
అయితే ఇలాంటి కేసులు వర్మకు కొత్త కాదు. వీటి నుంచి అతడు చాలా ఈజీగా బయటకొస్తాడు. ఎందుకంటే, అతడు పెట్టే ట్వీట్స్ అలా ఉంటాయి మరి. నేరుగా వ్యక్తిని ఉద్దేశించి కామెంట్ చేయడు, కానీ ఎవరికి తగలాలో వాళ్లకు తగుల్తాయి. పైగా అతడు పెట్టే పోస్టులు కూడా డొంక తిరుగుడుగా, లీగల్ గా దొరక్కుండా ఉంటాయి.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More