“ఇకపైన తెలంగాణాలో బెనిఫిట్ షోలు ఉండవు. టికెట్ రేట్లు పెంచబోము.”
అలా అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడంతో ముఖ్యమంత్రి అలా తెలిపారు. అల్లు అర్జున్ పై కేసు పెట్టి ఒక రోజు జైలులో కూడా ఉంచారు.
ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ “పెద్దలు” వెళ్లి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చలు జరిపారు. ఆ సమయంలో “తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్” బాధ్యతలు తీసుకున్న దిల్ రాజు ముందుండి ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య “వారధి” అయ్యారు. అప్పుడే టికెట్ రేట్ల పెంపు గురించి ముఖ్యమంత్రితో మాట్లాడారా అని మీడియా అడిగింది.
“టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అసలు ఇంపార్టెంటే కాదు. అది చాలా చిన్న అంశం,” అని దిల్ రాజు అన్నారు. ఆ చిన్నఅంశం కోసం దిల్ రాజు పెద్ద ప్రయత్నం చేసి మొత్తానికి ఇప్పుడు రేట్లు పెంచేలా చేశారు.
అవును, “గేమ్ ఛేంజర్” సినిమాకి టికెట్ రేట్లను పెంచింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి రోజు మల్టిప్లెక్స్ లో 150, సింగిల్ థియేటర్లో 100 రూపాయలు అదనంగా వసూలు చేసేందుకు అంగీకరించింది. మొదటి రోజు ఆరు ఆటలకు అనుమంతించింది. కేవలం “బెనిఫిట్ షో” మాత్రం అనుమతి ఇవ్వలేదు.
అటు రేవంత్ రెడ్డి మాట తూచ్ అన్నట్లు అయింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More