‘ఓదెల-2’ విడుదలైన వెంటనే అందులోని ఓ అభ్యంతరకరమైన సన్నివేశంపై కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. అదే నిజమైంది. ఈ సినిమాలో ‘పిచ్చగుంట్ల’ అనే పదాన్ని తప్పుగా వాడారు. దీంతో ఆ కులస్తులు మండిపడ్డారు.
ముందుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కంప్లయింట్ తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. తర్వాత వీళ్లు బీసీ కమిషన్ ను ఆశ్రయించారు. బీసీ కమిషన్ చొరవతో ఈ కేసులో కదలిక వచ్చింది.
సినిమాపై విచారణ జరిపించాలంటూ తెలంగాణ డీజీపీని ఆదేశించింది బీసీ కమిషన్. అలానే సెన్సార్ బోర్డును కూడా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించిన సెన్సార్ బోర్డు… ఆ అభ్యంతరకర పదాన్ని తొలిగిస్తామని ప్రకటించింది.
తమన్నా లీడ్ రోల్ లో నటించిన ‘ఓదెల-2’ భారీ అంచనాల మధ్య రిలీజైంది. ట్రయిలర్ తో సినిమాకు ఊపొచ్చింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. సినిమా సరిగ్గా ఆడలేదనే బాధకు తోడు నిర్మాతలకు ఇప్పుడిదో తలనొప్పి.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More