ఇద్దరూ ఇద్దరే. ఒకప్పుడు అరివీర భయంకరమైన హిట్స్ ఇచ్చారు. తిరుగులేని క్రేజ్ తో కొనసాగారు. రీసెంట్ గా ఇద్దరూ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కానీ కిందామీద పడుతున్నారు. వాళ్లే రాజశేఖర్, విజయశాంతి.
సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు మూవీతో రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. అయితే ఆ వెంటనే ఆమె చకచకా సినిమాలు చేయలేదు. మంచి కథలు, పాత్రల కోసం వెయిట్ చేస్తూ అలా ఉండిపోయారు.
మళ్లీ ఇన్నాళ్లకు కల్యాణ్ రామ్ తో సినిమా చేశారు. సినిమాలో విజయశాంతి పాత్రకు మంచి పేరొచ్చింది కానీ సినిమాకు మాత్రం ఆశించిన స్థాయిలో రీచ్ రావడం లేదు. సక్సెస్ తో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” సినిమాతో ఆ సక్సెస్ ను కొనసాగించలేకపోయారు.
ఇక రాజశేఖర్ పరిస్థితి మరీ దారుణం. సినిమాలు చేస్తూనే ఉన్నారు, ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవ్వాలని చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు.
కానీ చాన్నాళ్లు ఎదురుచూసి చివరికి ‘Extra Ordinary’ సినిమాతో క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రాజశేఖర్ ప్లాన్స్ మళ్లీ మొదటికొచ్చాయి. హీరోగా నటిస్తే జనం చూడడం లేదు, మంచి క్యారెక్టర్ రోల్స్ పడడం లేదు.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More