దేశవ్యాప్తంగా ఎండల మండిపోతున్నాయి. 40 డిగ్రీలు కామన్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో గుడిసెల్లో ఉండే పేదలు ఎంత ఇబ్బంది పడతారో ఊహించింది తాప్సి. అందుకే తన వంతు సాయంగా కొందరికి కూలర్లు, ఫ్యాన్స్ పంచింది.
ఈ వేసవి నుంచి ఉపశమనం అందించేందుకు ముంబయి మురికివాడల్లో నివశిస్తున్న కొంతమంది పేదలకు టేబుల్ ఫ్యాన్లు, మినీ కూలర్లు అందించింది తాప్సి. భర్త మథియాస్ బోతో కలిసి ఈ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొంది.
తాప్సి చూపించిన ఈ చొరవకు ఓ కంపెనీ సాయం అందించింది.
“మనం తరచుగా ఫ్యాన్ లేదా కూలర్ వంటి ప్రాథమిక సౌకర్యాలను తేలిగ్గా తీసుకుంటాం, కానీ ఈ భరించలేని వేడిలో, చాలా మందికి చిన్న గాలి కూడా ఒక వరంలా అనిపిస్తుంది. ఈ చొరవలో భాగం కావడం నన్ను చాలా కదిలించింది. ఇది ఇవ్వడం గురించి మాత్రమే కాదు, ఇది ప్రజలతో కలిసి నిలబడటం, వారి బాధను అర్థం చేసుకోవడం, వాళ్ల బాధను తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేయడం.”
ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది తాప్సి. త్వరలోనే ‘గాంధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ బ్యూటీ.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More