హీరో శ్రీవిష్ణు ప్రతి సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడు. “ఓం భీం బుష్” సినిమాలో ఒక మగ దెయ్యం అతన్ని ప్రేమిస్తుంది. ఇక ఆయన గత చిత్రంలో శ్రీవిష్ణు అనేక పాత్రలు పోషించాడు. అందులో ఒక కీలకమైన పాత్ర… ట్రాన్స్ జెండర్. ఐతే, దాన్ని జనం జీర్ణించుకోలేదు. సినిమా ఘోరంగా పరాజయం పాలు అయింది.
ప్రస్తుతం “సింగిల్” అనే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శ్రీ విష్ణు “స్వాగ్” విషయంలో చేసిన తప్పు గురించి మాట్లాడాడు.
“సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ కూడా ఫుల్లుగా కామెడీతో ఉంటుంది అని జనం భావించారు. కానీ జనం థియేటర్లోకి వచ్చాక వాళ్ల అంచనాలకు, సినిమా కంటెంట్ కి ఉన్న మిస్ మ్యాచ్ తో ఇబ్బంది పడ్డారు. కథ విషయంలో, ఎలాంటి సినిమా అనే విషయంలో జనాలకు ముందే చెప్పడంలో మేం ఫెయిల్ అయ్యాం. జనాలని ముందే ప్రిపేర్ చేసి ఉంటె ఫలితం వేరుగా ఉండేది. ఆ తప్పు చేసి ఉండకపోతే సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది,” అని శ్రీ విష్ణు తెలిపారు.
“ప్రయోగం చేసినప్పుడు అది ఫలితాన్ని ఇవ్వకపోతే అది ఒక అనుభవంగా, ఒక పాఠంగానే చూస్తాను. వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం,” అని క్లారిటీ ఇచ్చారు శ్రీవిష్ణు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More