హీరో శ్రీవిష్ణు ప్రతి సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడు. “ఓం భీం బుష్” సినిమాలో ఒక మగ దెయ్యం అతన్ని ప్రేమిస్తుంది. ఇక ఆయన గత చిత్రంలో శ్రీవిష్ణు అనేక పాత్రలు పోషించాడు. అందులో ఒక కీలకమైన పాత్ర… ట్రాన్స్ జెండర్. ఐతే, దాన్ని జనం జీర్ణించుకోలేదు. సినిమా ఘోరంగా పరాజయం పాలు అయింది.
ప్రస్తుతం “సింగిల్” అనే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శ్రీ విష్ణు “స్వాగ్” విషయంలో చేసిన తప్పు గురించి మాట్లాడాడు.
“సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ కూడా ఫుల్లుగా కామెడీతో ఉంటుంది అని జనం భావించారు. కానీ జనం థియేటర్లోకి వచ్చాక వాళ్ల అంచనాలకు, సినిమా కంటెంట్ కి ఉన్న మిస్ మ్యాచ్ తో ఇబ్బంది పడ్డారు. కథ విషయంలో, ఎలాంటి సినిమా అనే విషయంలో జనాలకు ముందే చెప్పడంలో మేం ఫెయిల్ అయ్యాం. జనాలని ముందే ప్రిపేర్ చేసి ఉంటె ఫలితం వేరుగా ఉండేది. ఆ తప్పు చేసి ఉండకపోతే సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది,” అని శ్రీ విష్ణు తెలిపారు.
“ప్రయోగం చేసినప్పుడు అది ఫలితాన్ని ఇవ్వకపోతే అది ఒక అనుభవంగా, ఒక పాఠంగానే చూస్తాను. వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం,” అని క్లారిటీ ఇచ్చారు శ్రీవిష్ణు.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More