తను టాలీవుడ్ కు దూరమవ్వలేదంటున్నాడు గాయకుడు సిద్ శ్రీరామ్. తన దగ్గరకొచ్చిన సాంగ్స్ నుంచి, మనసుకు నచ్చిన పాటలు పాడుతూనే ఉన్నానని తెలిపాడు. పెద్ద బ్యానర్లు, పెద్ద సంగీత దర్శకుల నుంచి తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదనే వాదనను తోసిపుచ్చాడు.
‘పుష్ప’ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్, ఛార్జ్ బస్టర్ గా నిలిచింది. అయితే ‘పుష్ప-2’లో మాత్రం సిద్ శ్రీరామ్ గొంతు వినిపించలేదు. దీనిపై స్పందించడానికి సిద్ శ్రీరామ్ నిరాకరించాడు. ఆ విషయాన్ని మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నే అడగాలన్నాడు.
అమెరికా నుంచి వచ్చి, హైదరాబాద్-చెన్నైలో పాటలు పాడి తిరిగి అమెరికా వెళ్లిపోయే ఈ సింగర్.. తన గాత్రంపై వస్తున్న విమర్శల్ని పట్టించుకోనంటున్నాడు. తెలుగు పదాల్ని సరిగ్గా ఉచ్ఛరించననే కామెంట్స్ తన వరకు రాలేదంటున్నాడు. తనకు ఓ ఏడాది టైం ఇస్తే, తెలుగులో అనర్ఘలంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.
హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు సిద్ శ్రీరామ్. ఇందులో తన సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు.. 80-90 దశకాల్లో వచ్చిన మెలొడీ సాంగ్స్ ను తన గొంతుతో వినిపించబోతున్నాడు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More