తమ సినిమాకు బజ్ తీసుకొచ్చేందుకు మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. టికెట్ కొనుగోలుపై ఫారిన్ ట్రిప్ కు వెళ్లే అవకాశం అంటుంటారు. ఇవి కాకుండా.. బై వన్ గెట్ వన్ ఆఫర్లు కూడా పెడుతుంటారు. ఇది కూడా అలాంటిదే.
సాయిరాం శంకర్ కొత్త సినిమా పేరు ‘ఒక పథకం ప్రకారం’. ఫిబ్రవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు డిఫరెంట్ కాంటెస్ట్ పెట్టారు.
7వ తేదీన 50 ప్రధాన కేంద్రాల్లో ఈ సినిమా మార్నింగ్ షో చూడాలి. ఇంటర్వెల్ ఇచ్చేసరికి సినిమాలో విలన్ ఎవరో చెప్పాలి. 50 థియేటర్లలో బయట కూపన్లు, డబ్బా ఉంటాయి. కూపన్ లో విలన్ పేరు, మీ మొబైల్ నంబర్ రాసి డబ్బాలో వేయాలి.
కరెక్ట్ గా విలన్ ను గెస్ చేస్తే, 10వేల రూపాయల బహుమతి అందిస్తారు. ఇదేదో మొత్తంగా లక్కీ డ్రా తీసి ఇచ్చే బహుమతి కాదు. ప్రతి థియేటర్ కు ఒక్కర్ని ఎంపిక చేసి బహుమతి అందిస్తారు. అంటే.. 50 థియేటర్లలో 50 మంది ఈ బహుమతి గెలుచుకునే అవకాశం అన్నమాట.
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతూ, లాంగ్ గ్యాప్ తీసుకొని, ఎట్టకేలకు ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో థియేటర్లలోకి వస్తున్న సాయిరాం శంకర్ కు, ఈ కాంటెస్ట్ ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More