శర్వానంద్ తాజా చిత్రం “మనమే.” ఈ సినిమాలో శర్వా సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజాగా ట్రయిలర్ రిలీజైంది. అందులో హీరోహీరోయిన్ల గిల్లికజ్జాల్ని చూపించారు. పరస్పరం విరుద్ధ భావాలు, ఆలోచన విధానం కలిగిన కపుల్ గా శర్వా-కృతి కనిపించారు.
ఈ సందర్భంగా ఓ కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చాడు శర్వానంద్.
హీరోహీరోయిన్లు తిట్టుకుంటే సినిమాసూపర్ హిట్టు అవుతుందట. రెండు సినిమాల్ని కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. మురారి, ఖుషి సినిమాల్లో హీరోహీరోయిన్లు ఒకర్నొకరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఆ ఘర్షణ నుంచే ఓ మేజిక్ మూమెంట్ పుట్టుకొస్తుంది. అదే మేజిక్ ‘మనమే’ సినిమాకు కూడా వర్కవుట్ అవుతుందంటున్నాడు శర్వా.
శ్రీరామ్ ఆదిత్య డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అతడి కొడుకు కీలక పాత్ర చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ సంగీతం అందించాడు. 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది మరి శర్వానంద్ చెప్తున్న తిట్టు సెంటిమెంట్ వర్క్ అవుతుందా?
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More