దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం “డాలర్ డ్రీమ్స్” 2000వ సంవత్సరంలో విడుదలైంది. పాతికేళ్ల కెరీర్ ని సెలెబ్రేట్ చేసుకోవాలని ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
టీనేజ్ నుంచి ఇప్పటివరకు చిరంజీవి తన ముందు అలాగే ఉన్నారు అంటూ శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియాలో రాసుకున్నారు.
ఇది శేఖర్ కమ్ముల రాసిన పోస్ట్: “teenageలో ఒక్కసారి చూశాను చిరంజీవి గారిని. దగ్గరగా చూశాను. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years. ‘lets celebrate’ అని మా team అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని generationsని inspire చేసిన personality ఆయన. ‘chase your dreams, success మనల్ని follow అయి తీరుతుంది’ అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే. so, నా 25 years journey celebration అంటే ఆయన presenceలోనే చేసుకోవాలి అనిపించింది. Thank You Sir. ఈ momentsలోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు.”
ఈ 25 ఏళ్ళలో శేఖర్ కమ్ముల “ఆనంద్,” “గోదావరి,” “హ్యాపీ డేస్”, “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”, “లీడర్”, “అనామిక”, “ఫిదా”, “లవ్ స్టోరీ” వంటి చిత్రాలు తీశారు .
శేఖర్ కమ్ముల తాజాగా ధనుష్ హీరోగా “కుబేర” సినిమా తీస్తున్నారు. అది జూన్ 20న విడుదల కానుంది.
నిత్యా మీనన్ ఇచ్చి పడేసింది. సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది ఈ బ్యూటీ. ఇది కూడా అలాంటి… Read More
మే నెల గడిచిపోయింది. జూన్ లో మరికొన్నిక్రేజీ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ముందుగా వస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. దాదాపు… Read More
సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు… Read More
సాధారణంగా మే నెల వేసవి సెలవుల కాలానికి చాలా కీలకం. అసలైన కలెక్షన్లు మేలోనే వస్తాయి. కానీ 2025లో సీన్… Read More
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'డ్రాగన్' అనే పేరు పరీశీలనలో ఉంది.… Read More
తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని… Read More