‘సలార్’ క్రేజ్ ఇంకా మార్కెట్లో నడుస్తోంది. సినిమా వచ్చి ఇన్నాళ్లయినా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఓటీటీలో ఈ సినిమా ఏడాది పాటు ట్రెండ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా నుంచి మరో సందడి మొదలైంది.
‘సలార్’ సినిమా నుంచి ప్రభాస్ ప్రతిమల్ని రిలీజ్ చేసింది హోంబలే సంస్థ. వీటిని ఆన్ లైన్లో పెట్టి ముందుగానే ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. 3 రూపాల్లో ప్రభాస్ సలార్ ప్రతిమల్ని తయారుచేసింది హోంబలే.
వీటిలో ఒకటి కాటేరమ్మ ఫైట్ సీన్ ను గుర్తు చేస్తుంది. ఇక మిగతా 2 బొమ్మల్లో ఒకదాంట్లో కత్తి పట్టిన ప్రభాస్ ను, మరో బొమ్మలో సంకెళ్లతో కట్టేసిన ప్రభాస్ ను తయారుచేశారు. వీటిలో కాటేరమ్మ ఫైట్ ప్రతిరూపాన్ని 4299 రూపాయలకు అమ్మబోతున్నట్టు ప్రకటించింది హోంబలే. మిగతా 2 బొమ్మలకు చెరో రూ.2999 రేటు ఫిక్స్ చేశారు.
అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ అభిమానులే ఈ బొమ్మలు చూసి పెదవి విరుస్తున్నారు. బొమ్మల్లో ప్రభాస్ ముఖం అస్సలు ఆయన పోలికలతో లేదని కొందరు అంటుంటగా, మరికొంతమంది మాత్రం బొమ్మలకు ధర ఎక్కువగా పెట్టారని కామెంట్ చేస్తున్నారు.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More