న్యూస్

నేను విచారణకు రాలేను

Published by

బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ కూడా ఓ లిస్ట్ తయారుచేసింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చనే అనుమానంతో తను కూడా 29 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

ఈ మేరకు కొందరికి నోటీసులిచ్చింది. ముందుగా దగ్గుబాటి రానాతో విచారణను మొదలుపెట్టాలనుకుంది. కానీ తొలి నోటీసుకే విముఖత ఎదురైంది. తను విచారణకు రాలేనని, మరింత సమయం కావాలని దగ్గుబాటి రానా కబురు పంపించాడు.

నోటీసులిచ్చిన తర్వాత, ఇలా ఒకసారి తిరస్కరించే హక్కు ఎవరికైనా ఉంటుంది. రానా కూడా ఆ వెసులుబాటును వినియోగించుకున్నాడు. మరో నోటీసు వస్తే మాత్రం ఆయన తప్పనిసరిగా ఎంక్వయిరీకి రావాల్సి ఉంటుంది.

బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేసిన వాళ్లలో రానా కూడా ఉన్నాడు. అయితే దానిపై అతడు ఇదివరకే వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ ఈడీ మాత్రం వదల్లేదు. విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి లాంటి నటీనటులకు కూడా నోటీసులు వెళ్లాయి.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025