ఊహించని విధంగా హీరో రాజ్ తరుణ్, వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి అతడిపై కేసు పెట్టింది. తనను శారీరకంగా, మానసికంగా వాడుకొని వదిలేశాడని, రాజ్ తరుణ్ పై ఆమె ఆరోపణలు చేసింది.
5 పేజీల సుదీర్ఘ లేఖను పోలీసులకు సమర్పించిన లావణ్, రాజ్ తరుణ్ తో తను సహజీవనం చేశానంటూ సాక్ష్యాలుగా కొన్ని ఫొటోల్ని కూడా పోలీసులకు అందించింది. తాజాగా దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు. లావణ్యతో తను కలిసున్న విషయం నిజమేనని అంగీకరించిన రాజ్ తరుణ్.. 2017 తర్వాత ఆమెతో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదంటున్నాడు.
తను హైదరాబాద్ వచ్చిన కొత్తలో లావణ్య చాలా సహాయం చేసిందని, ఆ కృతజ్ఞతతో ఆమెను ఇన్నాళ్లూ భరించానని తెలిపిన రాజ్ తరుణ్, కేవలం తన పరువు పోతుందనే ఉద్దేశంతోనే మూసుకొని ఉన్నానని, ఇకపై ఉపేక్షించనని స్పష్టం చేశాడు.
అప్పుడు హెబ్బా.. ఇప్పుడు లావణ్య.. మధ్యలో అవికా
ఒక దశలో లావణ్యను పెళ్లి చేసుకోవాలని కూడా తను అనుకున్నానని, కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేదని తెలిపిన రాజ్ తరుణ్.. ఎప్పుడైతే లావణ్య డ్రగ్స్ కు అలవాటు పడిందో, అప్పుడే ఆమెకు దూరమయ్యానని అంటున్నాడు.
అమ్మాయిలు, ఎఫైర్లు వంటి వివాదాలు రాజ్ తరుణ్ కు కొత్త కాదు. గతంలో హెబ్బా పటేల్ తో కూడా ప్రేయాణం సాగించినట్టు అతడిపై పుకార్లు వచ్చాయి. వాటిపై గతంలోనే రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. మరో వివాదంలో అవికా గౌర్, రాజ్ తరుణ్ పేర్లు వినిపించాయి. అయితే దానిపై ఎవ్వరూ ప్రకటన చేయలేదు. ఇప్పుడీ కొత్త వివాదాన్ని అతడు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More