గ్లోబల్ స్థాయిలో పేరున్న ప్రియాంక చోప్రా గురువారం హైదరాబాద్ కి వచ్చింది అనే విషయం ఇప్పటికే మేం పోస్ట్ చేశాం. ఆమె హైదరాబాద్ కి రావడానికి కారణం కూడా దర్శకుడు SS రాజమౌళిని కలవడానికే అని చెప్పాం. అది నిజమని ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియచేసింది.
రాజమౌళి తదుపరి చిత్రంలో ఆమె నటించనుంది అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్లో ఆమె మహేష్ బాబు సరసన నటించనుంది. అందుకోసమే ఆమె హైదరాబాద్ రావాల్సి వచ్చింది.
శుక్రవారం ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.టొరంటో నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు విమానంలో వస్తున్న వీడియో అది. ఆమె విమానంలోని తన సీట్లో కాళ్లు సీట్ పై పెట్టుకొని రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్”లోని పాటని వింటున్నట్లుగా ఉంది ఆ వీడియోలో. ఆమె అలా తన హైదరాబాద్ ట్రిప్ గురించి ఇండైరెక్ట్ గా కంఫర్మ్ చేసింది. సో, ఆమె రాజమౌళి చిత్రంలో నటించింది అనేది పక్కాగా రూఢి అయింది.
త్వరలోనే టీం నుంచి ఇక అధికారిక ప్రకటన రావొచ్చు. ఆమె గతంలో “అపురూపం” అనే తెలుగు సినిమాలో నటించింది కానీ ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More