గ్లోబల్ స్థాయిలో పేరున్న ప్రియాంక చోప్రా గురువారం హైదరాబాద్ కి వచ్చింది అనే విషయం ఇప్పటికే మేం పోస్ట్ చేశాం. ఆమె హైదరాబాద్ కి రావడానికి కారణం కూడా దర్శకుడు SS రాజమౌళిని కలవడానికే అని చెప్పాం. అది నిజమని ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియచేసింది.
రాజమౌళి తదుపరి చిత్రంలో ఆమె నటించనుంది అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్లో ఆమె మహేష్ బాబు సరసన నటించనుంది. అందుకోసమే ఆమె హైదరాబాద్ రావాల్సి వచ్చింది.
శుక్రవారం ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.టొరంటో నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు విమానంలో వస్తున్న వీడియో అది. ఆమె విమానంలోని తన సీట్లో కాళ్లు సీట్ పై పెట్టుకొని రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్”లోని పాటని వింటున్నట్లుగా ఉంది ఆ వీడియోలో. ఆమె అలా తన హైదరాబాద్ ట్రిప్ గురించి ఇండైరెక్ట్ గా కంఫర్మ్ చేసింది. సో, ఆమె రాజమౌళి చిత్రంలో నటించింది అనేది పక్కాగా రూఢి అయింది.
త్వరలోనే టీం నుంచి ఇక అధికారిక ప్రకటన రావొచ్చు. ఆమె గతంలో “అపురూపం” అనే తెలుగు సినిమాలో నటించింది కానీ ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది.
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ (Jeremy Irons) సరసన నటిస్తున్నారు. దర్శకుడు చంద్రన్ రత్నం… Read More
మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం… Read More
ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.… Read More