కుప్పం నుంచి వచ్చేవాళ్లు సాధారణంగా చంద్రబాబు ఫ్యాన్స్ ఉంటారు లేదా నారా లోకేష్ అభిమానులైనా అయి ఉంటారు. కానీ కుప్పం నుంచి ముగ్గురొచ్చారు. వాళ్లు ఎన్టీఆర్ అభిమానులు.
అభిమాన హీరోని కలిసేందుకు ఫ్యాన్స్ చేసే సాహసాలు చాలానే చూశాం. ఇది కూడా అలాంటి సాహసమే. కుప్పం నుంచి ఈ ముగ్గురు నడుచుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు. అక్షరాలా 620 కిలోమీటర్లు నడిచారు.
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ వీళ్లు తమ పాదయాత్ర ప్రారంభించారు. చేతిలో పెద్ద ఫొటో పట్టుకొని వందల కిలోమీటర్లు అలా నడుస్తూనే ఉన్నారు. విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది.
వెంటనే తన ఇంటికి పిలిపించుకున్నాడు తారక్. తన వీరాభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్లకు తనతో ఫొటోలు దిగే అవకాశం కల్పించాడు. అంత దూరం నడవకూడదంటూ వాళ్లను సున్నితంగా హెచ్చరించాడు కూడా. ఆ తర్వాత వాళ్లిచ్చిన ఫొటోను అందుకున్నాడు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More