ఇటీవల మంచి విజయం సాధించిన చిత్రం… “మహారాజా”. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశంసలు బాగా దక్కాయి. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన నిథిలన్ స్వామినాథన్ ని సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారు. స్క్రీన్ ప్లే అదరగొట్టావు అని మెచ్చుకున్నారు రజినీకాంత్.
చాలామంది హీరోలకు, హీరోయిన్లకు ఈ దర్శకుడి ప్రతిభ నచ్చింది. అందుకే కథ ఉంటే చెప్పు మనం సినిమా చేద్దాం అని పలువురు స్టార్స్ అతనికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. ఆమె సినిమా చేద్దామని చెప్పగానే “మహారాజా”కి సీక్వెల్ గా “మహారాణి” అనే స్క్రిప్ట్ వినిపించారట నిథిలన్. ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అన్నమాట.
నయనతారకి ఈ ఐడియా నచ్చిందట. వెంటనే సినిమా చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఐతే, ఇది వెంటనే ఉంటుందా లేక ఆ దర్శకుడు మరో సినిమా చేసిన తర్వాత నయనతార సినిమాని టేకప్ చేస్తాడా అన్నది చూడాలి.
నయనతార కూడా సోలో హీరోయిన్ గా ఒక మంచి హిట్ కావాలని చూస్తోంది. ఇటీవల ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు అంతగా ఆడడం లేదు. బాలీవుడ్ లో నటించిన “జవాన్” పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ అది పూర్తిగా షారుక్ ఖాన్ ఖాతాలోనే పడింది. తనకి సొంతగా హిట్ కావాలి. సూపర్ స్టార్ అన్న పేరుని నిలబెట్టుకోవాలంటే హీరోయిన్ గా పెద్ద హిట్స్ ఇవ్వాలి మరి.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More