3-4 రోజుల్లో కథ పూర్తిచేయడమే కాదు.. అంతే వేగంగా హీరోల నుంచి ఓకే కూడా చెప్పించుకుంటాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇతడి టాలెంట్ ఇది. ఏ హీరోనైనా సింగిల్ సిట్టింగ్ లో కథ చెప్పి, ఓకే చేయించుకోగల సత్తా ఉన్న దర్శకుడు ఇతడు.
తాజాగా ఈ దర్శకుడి టాలెంట్ కు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటించాడు సంజయ్ దత్. ఇతడి కాల్షీట్ల కోసం చార్మి, పూరి చాలా టెన్షన్ పడ్డారు. ఈ సంగతి పక్కనపెడితే.. సంజయ్ దత్ ను పూరి ఎలా ఒప్పించాడనేది ఇప్పుడు మేటర్.
సంజయ్ దత్ ను కలిసి కేవలం 10 నిమిషాలు అతడు చేయాల్సిన బిగ్ బుల్ పాత్రను వివరించాడట పూరి జగన్నాధ్. అంతే, ఆ 10 నిమిషాల నెరేషన్ కే సంజయ్ దత్ ఓకే చెప్పాడట. అంతేకాదు. ఆ క్యారెక్టర్ బాగా నచ్చడంతో, ఆ రాత్రి పూరి-చార్మికి పెద్ద పార్టీ కూడా ఇచ్చాడంట.
అలా 10 నిమిషాల్లో సంజూ బాబాను ఒప్పించిన పూరి జగన్నాధ్, ఆ తర్వాత అతడి కాల్షీట్లు దొరకబుచ్చుకోవడానికి మాత్రం చాలా కష్టపడ్డాడట. అందుకే ఎందుకైనా మంచిదని, ఫస్ట్ షెడ్యూల్ లోనే రామ్, సంజయ్ దత్ మధ్య క్లైమాక్స్ పార్ట్ షూట్ చేశారట.
తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లికి ప్రముఖలను నాగార్జున స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్… Read More
మణిరత్నం వంటి మహాదర్శకుడు కూడా హీరోయిన్ దీపిక పదుకోన్ కే మద్దతు ప్రకటించారు. షూటింగ్ టైం తక్కువ ఉండేలా చూడమని… Read More
డిసెంబర్ నెల కూడా తెలుగుసినిమాకి కీలకమైన సీజన్ గా మారింది. ఇటీవల పుష్ప 2, అఖండ వంటి సినిమాలు డిసెంబర్… Read More
నిత్యా మీనన్ ఇచ్చి పడేసింది. సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది ఈ బ్యూటీ. ఇది కూడా అలాంటి… Read More
మే నెల గడిచిపోయింది. జూన్ లో మరికొన్నిక్రేజీ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ముందుగా వస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. దాదాపు… Read More
సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు… Read More