3-4 రోజుల్లో కథ పూర్తిచేయడమే కాదు.. అంతే వేగంగా హీరోల నుంచి ఓకే కూడా చెప్పించుకుంటాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇతడి టాలెంట్ ఇది. ఏ హీరోనైనా సింగిల్ సిట్టింగ్ లో కథ చెప్పి, ఓకే చేయించుకోగల సత్తా ఉన్న దర్శకుడు ఇతడు.
తాజాగా ఈ దర్శకుడి టాలెంట్ కు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటించాడు సంజయ్ దత్. ఇతడి కాల్షీట్ల కోసం చార్మి, పూరి చాలా టెన్షన్ పడ్డారు. ఈ సంగతి పక్కనపెడితే.. సంజయ్ దత్ ను పూరి ఎలా ఒప్పించాడనేది ఇప్పుడు మేటర్.
సంజయ్ దత్ ను కలిసి కేవలం 10 నిమిషాలు అతడు చేయాల్సిన బిగ్ బుల్ పాత్రను వివరించాడట పూరి జగన్నాధ్. అంతే, ఆ 10 నిమిషాల నెరేషన్ కే సంజయ్ దత్ ఓకే చెప్పాడట. అంతేకాదు. ఆ క్యారెక్టర్ బాగా నచ్చడంతో, ఆ రాత్రి పూరి-చార్మికి పెద్ద పార్టీ కూడా ఇచ్చాడంట.
అలా 10 నిమిషాల్లో సంజూ బాబాను ఒప్పించిన పూరి జగన్నాధ్, ఆ తర్వాత అతడి కాల్షీట్లు దొరకబుచ్చుకోవడానికి మాత్రం చాలా కష్టపడ్డాడట. అందుకే ఎందుకైనా మంచిదని, ఫస్ట్ షెడ్యూల్ లోనే రామ్, సంజయ్ దత్ మధ్య క్లైమాక్స్ పార్ట్ షూట్ చేశారట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More