మూడో చిత్రంతోనే పెద్ద దర్శకుడిగా మారిపోయాడు నాగ్ అశ్విన్. “ఎవడే సుబ్రహ్మణ్యం”, “మహానటి” చిత్రాల తర్వాత నాగ్ అశ్విన్ తీసిన మూవీ… కల్కి 2898 AD. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
ఈ సినిమాకి రెండో భాగం కూడా తీస్తున్నాడు నాగ్ అశ్విన్. మూడు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో వేర్వేరు నటులు నటించారు. మొదటి చిత్రంలో నాని హీరో. రెండో చిత్రంలో కీర్తి సురేష్ మెయిన్ రోల్. మూడో చిత్రంలో ప్రభాస్ కథానాయకుడు. ఐతే, ఈ మూడు సినిమాల్లోనూ విజయ్ దేవరకొండ ఉన్నాడు. “ఎవడే సుబ్రహ్మణ్యం” చిత్రంలో రెండో హీరోలాంటి పాత్ర. “మహానటి”లో జర్నలిస్ట్ టీంలో ఒకరిగా కనిపించాడు. “కల్కి 2898 AD”లో అర్జునుడిగా నటించాడు.
ఐతే “కల్కి 2898 AD”లో విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీపై ఒక వర్గం నానా రచ్చ చేసింది. ఇటీవల కొన్ని “బలమైన” శక్తులకి చెందిన వారు కొంతకాలంగా విజయ్ దేవరకొండని టార్గెట్ చేశారు. తెగ ట్రోలింగ్ చేస్తోంది ఆ శక్తుల బృందం. “కల్కి 2898 AD” విషయంలో కూడా జరిగింది. ఐతే, నాగ్ అశ్విన్ మాత్రం ఈ మూకని పట్టించుకోవడం లేదు.
“నేను తీసే అన్ని సినిమాల్లో విజయ్ దేవరకొండ ఉండేలా చూసుకుంటా. ఎదో ఒక పాత్రలో నా సినిమాలో అతను కనిపిస్తాడు,” అని ప్రకటించాడు.
నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ చాలా కాలంగా స్నేహితులు. శేఖర్ కమ్ముల “హ్యాపీ డేస్” తీస్తున్న సమయంలో వీరికి స్నేహం ఏర్పడింది. అప్పుడు నాగ్ అశ్విన్ కమ్ముల వద్ద సహాయ దర్శకుడు. విజయ్ ఆ సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. అప్పటి నుంచి వారి ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతోంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More