మరకతమని కీరవాణికి ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అందుకున్న మొదటి తెలుగు వాడు కీరవాణి. అరుదైన ఘనత ఇది. “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం స్వరపరిచిన “నాటు నాటు” అనే పాటకు ఆస్కార్ జ్యూరీ ఉత్తమ పాటగా అవార్డు ప్రదానం చేసింది.
ఐతే, కీరవాణి మాత్రం ఇది గొప్ప పాట కాదు అనే భావనతోనే ఉన్నారు. “నేను స్వరపరిచిన వాటిలో కూడా ఇది బెస్ట్ కాదు. జనాలకు ఆ టైంలో నచ్చింది. వైరల్ అయింది. కానీ ఇది గొప్ప పాట, బెస్ట్ కంపొజిషన్ అని మాత్రం అని అనను,” అని తాజాగా కీరవాణి పేర్కొన్నారు.
నిజమే కీరవాణి తన కేరీర్ లో ఎన్నెన్నో గొప్ప పాటలు చేశారు. వాటికి ఆస్కార్ రాలేదు. ఆ మాటకొస్తే ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకులు ఎన్నో గొప్ప పాటలు స్వరపరిచారు కానీ వాటికి ఆ అదృష్టం దక్కలేదు.
ఆస్కార్ అవార్డు అంటే అంతే. ఆ ఏడాది విడుదలైన వాటిలో ఆస్కార్ పరిశీలనకు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. “ఆర్ ఆర్ ఆర్” టీం చేసిన సోషల్ మీడియా ప్రచారం, హంగామా కారణంగా ఆస్కార్ జ్యురి వరకు ఈ సినిమా వెళ్ళింది. అక్కడి వాళ్లకు సినిమా కన్నా ఈ పాట నచ్చింది. దాంతో, అవార్డు ఇచ్చారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More