మరకతమని కీరవాణికి ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అందుకున్న మొదటి తెలుగు వాడు కీరవాణి. అరుదైన ఘనత ఇది. “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం స్వరపరిచిన “నాటు నాటు” అనే పాటకు ఆస్కార్ జ్యూరీ ఉత్తమ పాటగా అవార్డు ప్రదానం చేసింది.
ఐతే, కీరవాణి మాత్రం ఇది గొప్ప పాట కాదు అనే భావనతోనే ఉన్నారు. “నేను స్వరపరిచిన వాటిలో కూడా ఇది బెస్ట్ కాదు. జనాలకు ఆ టైంలో నచ్చింది. వైరల్ అయింది. కానీ ఇది గొప్ప పాట, బెస్ట్ కంపొజిషన్ అని మాత్రం అని అనను,” అని తాజాగా కీరవాణి పేర్కొన్నారు.
నిజమే కీరవాణి తన కేరీర్ లో ఎన్నెన్నో గొప్ప పాటలు చేశారు. వాటికి ఆస్కార్ రాలేదు. ఆ మాటకొస్తే ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకులు ఎన్నో గొప్ప పాటలు స్వరపరిచారు కానీ వాటికి ఆ అదృష్టం దక్కలేదు.
ఆస్కార్ అవార్డు అంటే అంతే. ఆ ఏడాది విడుదలైన వాటిలో ఆస్కార్ పరిశీలనకు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. “ఆర్ ఆర్ ఆర్” టీం చేసిన సోషల్ మీడియా ప్రచారం, హంగామా కారణంగా ఆస్కార్ జ్యురి వరకు ఈ సినిమా వెళ్ళింది. అక్కడి వాళ్లకు సినిమా కన్నా ఈ పాట నచ్చింది. దాంతో, అవార్డు ఇచ్చారు.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More