మహేష్ బాబు ఇప్పటికే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్నాడు. అంబానీ పెళ్లి వేడుకలో సరికొత్త మేకోవర్ తో ప్రత్యక్షమయ్యాడు మహేష్ బాబు. ఆ స్టిల్స్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక దశలో అంబానీ పెళ్లి వేడుక కంటే, మహేష్ కొత్త మేకోవర్ ఫొటోలే ట్రెండింగ్ అయ్యాయి.
అలా తన లుక్ తో సంచలనం సృష్టించిన మహేష్, ఈరోజు మరోసారి వైరల్ అయ్యాడు. దీనికి కూడా ఓ కారణం ఉంది. ఈసారి మహేంద్రసింగ్ ధోనీతో కలిశాడు సూపర్ స్టార్. మహేష్-ధోనీ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
తమతమ రంగాల్లో మహేష్, ధోనీ సాధించిన ఘనతల గురించి అందరికీ తెలిసిందే. కేవలం రికార్డ్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత లక్షణాల్లో కూడా ఇద్దరి మధ్య చాలా పోలికలున్నాయి. ఎటువంటి సందర్భంలోనైనా ఇద్దరూ కూల్ గా ఉంటారు. కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్నారు.
అందుకే వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. దాదాపు ఇదే లుక్ ను రాజమౌళి సినిమాలో కొనసాగించే అవకాశం ఉంది.
రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More
గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More
మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More
'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More
"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More